నాంపల్లి ఇండిపెండెంట్ మహిళా అభ్యర్థిపై మజ్లిస్ కార్పొరేటర్ భర్త దాడి

నాంపల్లి ఇండిపెండెంట్ మహిళా అభ్యర్థిపై మజ్లిస్ కార్పొరేటర్ భర్త దాడి

మెహిదీపట్నం, వెలుగు: నాంపల్లి ఇండిపెండెంట్ మహిళా అభ్యర్థిపై మజ్లిస్ కార్పొరేటర్  భర్త, నేతలు దాడి చేసిన ఘటన ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన  వివరాలు ఇలా ఉన్నాయి. నాంపల్లి సెగ్మెంట్ నుంచి ఇండిపెండెంట్ గా అంజుమ బేగం (25) పోటీ చేస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం మురాద్ నగర్ లోని పోలింగ్ బూత్ లో ఏజెంట్లు, కొందరు మహిళలతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు.  స్థానిక మజ్లిస్ కార్పొరేటర్ భర్త మూసా వెళ్లి ఇక్కడ ఎందుకు మీటింగ్ పెట్టావంటూ ప్రశ్నిస్తూ ఆమెపై దాడి చేశాడు. 

ఆపై బట్టలను కూడా చించివేశాడని, ప్రైవేట్ పార్ట్స్ కూడా పట్టుకున్నాని అంజుమ్ ఆసిఫ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలు, స్థానికులు డిమాండ్ చేశారు.