ముంబై: ఆటను ఓ అలవాటుగా మార్చుకోవాలన్నారు క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా సచిన్ టెండూల్కర్ యువతకు ట్విట్టర్ ద్వారా సందేశం ఇచ్చాడు. ఆటను ఓ అలవాటుగా మార్చుకోవాలని, అత్యంత కఠిన పరిస్థితుల్లోనూ స్పోర్ట్స్ నమ్మకాన్ని, సంతోషాన్ని ఇస్తాయని ట్వీట్ చేశాడు. ప్రతి ఏడాది ఆగస్ట్ 29న హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని నేషనల్ స్పోర్ట్స్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన ట్వీట్తో పాటు పిల్లలతో కలిసి తాను క్రికెట్ ఆడుతున్న వీడియోను కూడా సచిన్ షేర్ చేశాడు. ఈ నేషనల్ స్పోర్ట్స్ డే నాడు ఆటను ఓ అలవాటుగా మార్చుకోండి. మనతోపాటు చుట్టుపక్కల వాళ్లను ఆనందంగా ఉంచండి అని సచిన్ ట్వీట్ చేశాడు.