
- మాల సంఘం రాష్ట్ర వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్
బాన్సువాడ రూరల్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని మాల సంఘం తెలంగాణ రాష్ర్ట వ్యవస్థాపకులు అయ్యాల సంతోష్ అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో వివేక్ వెంకట స్వామికి చోటు కల్పించడంతో ఆదివారం బాన్సువాడ పట్టణంలో మాల సంఘం నాయకులు సంబరాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, స్వీట్లను తినిపించుకున్నారు. మంత్రి వర్గంలో వివేక్ వెంకట స్వామికి చోటు కల్పించడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ కి మాల సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
సంతోష్ మాట్లాడుతూ.. వివేక్ వెంకట స్వామి తెలంగాణ ఉద్యమం సమయంలో అందర్నీ ఏకతాటిపైకి తేవడంలో కీలక పాత్ర పోషించారన్నారు. తెలంగాణ కోసం అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారన్నారు. మాలల ఐక్య వేదిక జిల్లా అధ్యక్షుడు గైని ప్రవీణ్ కుమార్, డివిజన్ నాయకులు దోనకంటి ఆంజనేయులు, దడేకర్ సురేశ్, బేగరి గంగారాం, మంగ సుధాకర్, కాంబ్లే అశోక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకట్ స్వామికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడం అభినందనీయమని మాల మహానాడు ఆర్మూర్ డివిజన్ కమిటీ అధ్యక్షుడు మేదరి రాజన్న, ప్రధాన కార్యదర్శి మూగ ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి శెట్టిపల్లి నారాయణ అన్నారు. వివేక్కు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించడాన్ని హర్షిస్తూ ఆదివారం ఆర్మూర్లో మాల మహానాడు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సంబురాలు జరిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పటాకులు కాల్చారు. మాల మహానాడు డివిజన్ ట్రెజరర్ పులి గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షుడు టీచర్ పెద్ద భోజన్న, అడ్వకేట్ పోశన్న, పింజ రవి, దార్ల ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్, వెలుగు: మాల సామాజిక వర్గానికి చెందిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా కామారెడ్డి జిల్లా మాలల సంఘం రాష్ర్ట నాయకుడు, జిల్లా ఉద్యమకారుల సంఘం అధ్యక్షుడు భూమేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భూమేశ్ మాట్లాడుతూ.. మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి ఇవ్వడంతో రాష్ర్ట మాలలను ప్రభుత్వం గౌరవించిందని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ నాయకత్వానికి రాష్ర్ట సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్కు కృతజ్ఞతలు తెలిపారు.