పబ్లిక్​ టాయిలెట్​ ఎత్తుకెళ్లిన కేటుగాడు

పబ్లిక్​ టాయిలెట్​ ఎత్తుకెళ్లిన కేటుగాడు

మల్కాజిగిరి, వెలుగు: బల్దియా పబ్లిక్ ​టాయిలెట్  ని ఎత్తుకెళ్లిన నిందితుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్​ చేశారు. గత గురు వారం మల్కాజిగిరి బల్దియా సర్కిల్​ కమిషనర్ రాజు 140 డివిజన్​లో  పబ్లిక్​ టాయిలెట్​కనిపించడంలేదని పోలీసులకు కంప్లయింట్​ చేశాడు. కేసు ఫైల్​ చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సోమవారం దోమలగూడ లోని గౌడ హాస్టల్​వద్ద ఉండే టాటా ఏస్​ ట్రాలీ డైవర్​ ముప్పారం జోగయ్య (36) ను అదుపులోకి తీసుకుని విచారించారు. బల్దియా బుద్ధభవన్​లో పని చేసే అరుణ్​ కుమార్​, ఆనంద్​బాగ్​లోని జైన్​ కనస్ట్రక్షన్​లో పనిచేసే భిక్షపతి ఆదేశాలతోనే టాయిలెట్​ఎత్తుకెళ్లినట్టు జోగయ్య చెప్పాడు. టాయిలెట్​అమ్మగా వచ్చిన రూ. 45 వేల నగదు, టాటా ఏస్ ​ట్రాలీని సీజ్​చేసి కోర్టులో హాజరు పరిచి నిందితుడిని రిమాండ్​కు తరలించామని ఎస్​ఐ యాదగిరి తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం

నా భూమిని ఇప్పించండి.. లేదా సూసైడ్​కు పర్మిషన్​ ఇయ్యండి?

చిన్నఇన్వెస్టర్లకు పెద్ద దెబ్బ