మల్కాజిగిరి, వెలుగు: బల్దియా పబ్లిక్ టాయిలెట్ ని ఎత్తుకెళ్లిన నిందితుడిని మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. గత గురు వారం మల్కాజిగిరి బల్దియా సర్కిల్ కమిషనర్ రాజు 140 డివిజన్లో పబ్లిక్ టాయిలెట్కనిపించడంలేదని పోలీసులకు కంప్లయింట్ చేశాడు. కేసు ఫైల్ చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా సోమవారం దోమలగూడ లోని గౌడ హాస్టల్వద్ద ఉండే టాటా ఏస్ ట్రాలీ డైవర్ ముప్పారం జోగయ్య (36) ను అదుపులోకి తీసుకుని విచారించారు. బల్దియా బుద్ధభవన్లో పని చేసే అరుణ్ కుమార్, ఆనంద్బాగ్లోని జైన్ కనస్ట్రక్షన్లో పనిచేసే భిక్షపతి ఆదేశాలతోనే టాయిలెట్ఎత్తుకెళ్లినట్టు జోగయ్య చెప్పాడు. టాయిలెట్అమ్మగా వచ్చిన రూ. 45 వేల నగదు, టాటా ఏస్ ట్రాలీని సీజ్చేసి కోర్టులో హాజరు పరిచి నిందితుడిని రిమాండ్కు తరలించామని ఎస్ఐ యాదగిరి తెలిపారు.
మరిన్ని వార్తల కోసం
నా భూమిని ఇప్పించండి.. లేదా సూసైడ్కు పర్మిషన్ ఇయ్యండి?