దేశంలో దీదీని మించిన లీడర్ లేరు

దేశంలో దీదీని మించిన లీడర్ లేరు

భోపాల్: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మమతా బెనర్జీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ కూడా దీదీని పొగడ్తలతో ముంచెత్తారు. ఇప్పుడు దేశంలో మమతను మించిన నేత లేరంటూ కమల్ కామెంట్ చేశారు. విపక్షాలతోపాటు ప్రధాని మోడీ, సీబీఐ, ఈడీ లాంటి సెంట్రల్ ఏజెన్సీలకు ఎదురొడ్డి ఆమె విజయం సాధించారన్నారు. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీకి పోటీగా విపక్షాల నుంచి మమత నిలబడతారా అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడే ఏమీ చెప్పలేమన్నారు. దీన్ని యూపీఏ నిర్ణయిస్తుందన్నారు.