గండిపేట,వెలుగు: శంషాబాద్లోని మధురానగర్లోని రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో ఓ వ్యక్తి బైక్ట్రయల్చూస్తానని చెప్పి వాహనంతో సహా పరారయ్యాడు. ఆదివారం ఓ వ్యక్తి బైక్ కొంటానంటూ కస్టమర్ లాగా షోరూమ్లోకి వచ్చాడు. టెస్ట్ రైడ్ చేస్తానని చెప్పి ఫామ్లో తప్పుడు పేరు, నకిలీ ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ రాశాడు. తర్వాత షోరూమ్ సిబ్బంది బైక్ ఇవ్వడంతో స్టార్ట్ చేసి రోడ్డుపైకి వెళ్లాడు.
అలా వెళ్లిన వ్యక్తి ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో షోరూమ్ సిబ్బంది ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్వచ్చింది. దీంతో చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో అతడు మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ టీవీ విజువల్స్ఆధారంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
