
నల్లగొండ జిల్లాలో ఉద్యోగాలిప్పామని మోసం చేసి లక్షలు దండుకుంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరిగేషన్ డిపార్టుమెంటులో ఉద్యోగాలిప్పిస్తానని నమ్మబలికి లక్షలు వసూలు చేసి బాదితుల ఫిర్యాదులు కటకటాలు లెక్కిస్తున్నాడు. దేవరకొండ పట్టణంలో ఉద్యోగాల పేరిట రూ.17 లక్షలు వసూలు మోసం చేసిన మాదిన్నే కృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దేవరకొండ పట్టణంలోని బీఎన్ ఆర్ కాలనీకిచెందిన మాదిన్నే కృష్ణ..ఇరిగేషన్ శాఖలో ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకొని పలువురిని మోసం చేశాడు.2022లో ముడావత్ స్వాతి, ముడావత్ రమేష్, షేక్ సైదాబేగం, షేక్ తబ్రేజులను నమ్మించి రూ.17లక్షలు వసూల చేశాడు.ఇప్పటివరకు ఎటువంటి ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తుండటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన దేవరకొండ పోలీసులు..మాదిన్నే కృష్ణను అరెస్ట్ చేసి మీడియాముందు అతని మోసాల చిట్టాను వివరించారు ఏఎస్పీ మౌనిక. నిందితుడినుంచి రూ.8లక్షలు, సెల్ ఫోన్ రికవరీ చేశారు.