
న్యూఢిల్లీ: మద్యం తాగిన తర్వాత మనిషి మృగంలా మారుతాడంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏడేండ్ల కూతురిపై అత్యాచారానికి పాల్పడిన తండ్రికి శిక్ష రద్దుచేయలేమని తేల్చి చెప్పింది. ఉత్తరాఖండ్కు చెందిన ఓ డాక్టర్ (కార్డియాలజిస్ట్) భార్యతో విడిపోయి ఉంటున్నాడు. ఏడేండ్ల కూతురుతో అతడి భార్య వారణాసిలో ఉంటోంది. కుమార్తెను తన వద్దకు తెచ్చుకున్న సదరు వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. 2018 నాటి ఈ కేసులో నిందితుడిని స్థానిక కోర్టు దోషిగా తేల్చి శిక్ష విధించింది. తాజాగా ఈ శిక్షను సుప్రీంకోర్టు సమర్థిస్తూ తీర్పు చెప్పింది.