లీగల్ నోటీస్ వచ్చిందని.. ఆత్మహత్య

లీగల్ నోటీస్ వచ్చిందని.. ఆత్మహత్య

నవాబుపేట, వెలుగు: లీగల్​ నోటీస్​ రావడంతో భయపడిపోయిన ఓ వ్యక్తి గ్రామ శివారులోని చెట్టుకు ఉరి వేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్​నగర్​జిల్లా నవాబుపేట మండలం దరిపల్లి గ్రామానికి చెందిన భక్తుల శేఖర్(38) గతంలో తనకున్న పొలాన్ని అమ్మాపూర్ ​గ్రామానికి చెందిన వ్యక్తులకు అమ్మాడు. పొలం రిజిస్ట్రేషన్ ​చేయించుకున్న సదరు వ్యక్తులు తమకు ఇంకా శేఖర్​బాకీ ఉన్నాడని కోర్టుకు వెళ్లారు. దాంతో శేఖర్​కు లీగల్ నోటీసులు వచ్చాయి. బుధవారం కోర్టు హియరింగ్ ఉండడంతో భయపడిపోయిన శేఖర్​ సోమవారం రాత్రి గ్రామ శివారులోని తుమ్మ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.