అదృష్టం అంటే ఇదే.. తండ్రి లక్ష పెట్టి కొన్న స్టాక్స్.. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.80 కోట్లు

అదృష్టం అంటే ఇదే.. తండ్రి లక్ష పెట్టి కొన్న స్టాక్స్.. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.80 కోట్లు

పెట్టుబడుల విషయంలో ఉండాల్సింది రెండు ప్రధాన లక్షణాలు మాత్రమే. ఒకటి సరైన పెట్టుబడిని ఎంపిక చేసుకోవటం రెండవది దాని నుంచి మంచి ఫలాల  కోసం అవసరమైన సమయాన్ని ఇచ్చేంత ఓపికను కలిగి ఉండటం. మార్కెట్లో భడా ఇన్వెస్టర్లుగా పేరొందిన చాలా మంది సహజంగా సూచించే సక్సెస్ సూత్రాలు కూడా ఇవే. తాజాగా 30 ఏళ్ల కిందట ఒక తండ్రి చేసిన పెట్టుబడి అతని కొడుకు జీవితాన్ని ఆర్థికంగా ఎలా మార్చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..

వివరాల్లోకి వెళితే ఒక వ్యక్తి తన తండ్రి 1990లలో జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన షేర్లు బయటపడినట్లు రెడిట్ పోస్టులో బహిర్గతం చేశాడు. అప్పట్లో లక్ష రూపాయలు వెచ్చించి కొన్న ఫిజికల్ షేర్లు బయటపడినట్లు అందులో పేర్కొన్నాడు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు తాము హోల్డ్ చేసిన షేర్ల విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం దాదాపు రూ.80 కోట్లకు చేరిందని తన పోస్టులో సదరు యూజర్ వెల్లడించారు. 

 

ఒక రెడిట్ యూజర్ చేసిన పోస్టు వివరాలను సౌరవ్ దత్తా అనే వ్యక్తి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయటంతో ప్రస్తుతం ఈ విషయం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది. దీని నుంచి ఇన్వెస్టర్లు గమనించాల్సిన విషయం ఒక్కటే.. మంచి రాబడిని ఆశించేవారు తప్పకుండా దీర్ఘకాలం కోసం పెట్టుబడిని కొనసాగించటం ముఖ్యం అన్నదే.