వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ లో ఓ ప్రయాణికుడు కదులుతున్న రైలు ఎక్కబోయి అదుపుతప్పి ట్రైన్, ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో రన్నింగ్ లో ఉన్న ట్రైన్ ముందుకు ఈడ్చుకుంటూ వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ట్రౌన్ నిలిపివేశారు.
అనంతరం అతన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో ప్లాట్ఫాం పగలగొట్టి బయటకు తీశారు. ఈ క్రమంలోప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితునికి చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
గాయపడిన వ్యక్తి కర్నాటక రాయచూర్ కు చెందిన సతీశ్ గా గుర్తించారు రైల్వే పోలీసులు. ఈ ఘటనతో ట్రైన్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. ప్లాట్ఫాం మధ్యలో ఇరుక్కుపోయిన సతీష్ రెండు గంటలు నరకయాతన అనుభవించాడు.