భార్య, అత్తను నరికి చంపిన కిరాతకుడు

భార్య, అత్తను నరికి చంపిన కిరాతకుడు

సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది.  కట్టుకున్న భార్యను, ఆమె తల్లిని గొడ్డలితో నరికిచంపాడో కిరాతకుడు. జిన్నారం మండలం, ఐడీఏ బొల్లారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గాంధీనగర్‌కు చెందిన నర్సింహ్మ (40).. తన భార్య స్వరూప (32), అత్త ఎల్లమ్మ (55)లను గొడ్డలి నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నర్సింహ్మను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.