మట్టిపెల్లలు కూలి వ్యక్తి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మట్టిపెల్లలు కూలి వ్యక్తి మృతి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కందుగుల దగ్గర మట్టిపెల్లలు కూలి ఓవ్యక్తి చనిపోగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. జియో కంపెనీ కేబుల్ పనులు చేస్తుండగా ప్రమాదం జరిగింది. జేసీబీ సాయంతో నాలుగు గంటలు శ్రమించి మట్టిలో కూరుకుపోయిన ఇద్దరిని బయటికి తీశారు పోలీసులు.

వీరిలో వరంగల్ అర్బన్ జిల్లా హాసన్ పర్తి మండలం అరవపల్లికి చెందిన ప్రవీణ్ చనిపోగా, సిరిసిల్ల జిల్లా నామాపూర్ కు చెందిన మైసయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. తవ్వకాలకు అనుమతి ఉందాలేదా అనేది దర్యాప్తు చేస్తామన్నారు పోలీసులు.