గణేశ్ మండపంలో నిద్రపోతుండగా.. చోరీకి యత్నం

గణేశ్ మండపంలో నిద్రపోతుండగా.. చోరీకి యత్నం

హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు,ఆఫీసులు, దేవుడి గుళ్లు వేటిని వదలడం లేదు. యధేచ్చగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం  గణేష్ ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే . అయితే కొందరు కేటుగాళ్లు గణేశ్ మండపాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలు చేస్తున్నారు.  రెండు రోజుల క్రితం  మియాపూర్ లోని ఓ గణేశ్ మండపంలో ఓ వ్యక్తి గణేశ్ చేతిలో నుంచి 11 కిలోల లడ్డూను చోరీ చేసిన సంగతి తెలిసిందే. .లేటెస్ట్ గా  మేడ్చల్ మల్కాజ్ గిరి పీఎస్ పరిధిలోని  ఓ గణేశ్ మండపంలో  సెల్ ఫోన్లు  ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించాడు  ఓ దుండగుడు.

రాఘవేంద్ర కాలనీలో గణేశుడి మండలం దగ్గర నిద్రస్తున్నారు మండప నిర్వాహకులు. తెల్లవారుజామున నిద్రపోతున్నవారి ఫోన్లు, కారు కీస్ తీసుకుని పారిపోయేందుకు ప్రయత్నించాడు ఓ దుండగుడు. 

వెంటనే అప్రమత్తమైన నిర్వహకులు.. దొంగను వెంబడించడంతో ఫోన్లు, కారు కీస్ అక్కడే వదిలేసి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.