- హాస్పిటల్కు తరలింపు.. ఇయ్యాల ఆపరేషన్
- పరామర్శించిన కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్పార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ బాత్రూంలో కాలు జారి పడ్డారు. ఆయన బస చేస్తోన్న హోటల్ (వెస్టర్న్ కోర్టు)లోని బాత్ రూంలో ఆదివారం కాలు జారడంతో ఆయన తొడ భాగంలో బోన్ ఫ్యాక్చర్ అయింది. వెంటనే ఆయన్ను అంబులెన్స్లో ఢిల్లీలోని ఇంద్రపస్థ అపోలో హాస్పిటల్కు తరలించినట్లు ఆయన అనుచరుడు కూరపాటి సోలు రాజ్ మీడియాకు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారన్నారు. సోమవారం ఉదయం కాలుకి ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఢిల్లీ ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మంద కృష్ణ మాదిగను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు.