మాణిక్యం ఠాగూర్ నియామకంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం: పొన్నం ప్రభాకర్

మాణిక్యం ఠాగూర్ నియామకంతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం: పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అధినేత్రి సోనియా గాంధీ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో రాష్ట్రాల ఇన్చార్జీలను మార్చడం ముఖ్యమైన నిర్ణయం. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా కుంతియాను తొలగించి ఆయన స్థానంలో తమిళనాడుకు చెందిన మాణిక్యం ఠాగూర్ ను కొత్త ఇన్చార్జీగా నియమించారు. ఈ నియామకంపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు.

మాణిక్యం ఠాగూర్ నియామకం తెలంగాణ కాంగ్రెస్ కు ఎంతో లాభం జరుగుతుందన్నారు పొన్నం. అంతేకాదు రాష్ట్రంలో పార్టీ బలపేతమవుతుందని అన్నారు. ఠాగూర్ కు విద్యార్థి విభాగం, యూత్ కాంగ్రెస్ విభాగాల్లో సంస్థాగతంగా పనిచేసిన అనుభవం ఉందన్నారు.

ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జీగా వ్యవహరించిన కుంతియాకు ఉన్న పదవి పోవడమే కాదు… కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ కమిటీలోనూ స్థానం దక్కలేదు.