అడ్వకేట్ దంపతుల హత్య కేసులో టీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ మేనల్లుడు బిట్టు శీను అరెస్ట్

అడ్వకేట్ దంపతుల హత్య కేసులో టీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ మేనల్లుడు బిట్టు శీను అరెస్ట్

పెద్దపల్లి జిల్లా మంథనిలో దారుణ హత్యకు గురైన హైకోర్టు లాయర్ దంపతుల హత్య కేసులో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనును పోలీసులు శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. బుధవారం మంథనిలో గట్టు వామన్ రావు, నాగమణి దంపతులను కొంతమంది దుండగులు దారికాచి నడిరోడ్డు మీద నరికి చంపారు. అయితే ఆ నిందితులకు జడ్పీ ఛైర్మన్ పుట్టా మధు మేనల్లుడు బిట్టు శ్రీను వాహనం, కత్తులు సమకూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ జంట హత్యలు జరిగినప్పటినుంచి బిట్టు శ్రీను కనిపించకుండా పోయాడు. కాగా.. హత్య చేసిన ముగ్గురు నిందితులలో ఇద్దరిని మహారాష్ట్ర బార్డర్‌లో, మరోకరిని గోదావరిఖనిలో పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం బిట్టు శ్రీనుని మంథనిలో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.