బాబు విదేశీ పర్యటనలతో లాభం ఎంత వచ్చింది : బుగ్గన

బాబు విదేశీ పర్యటనలతో లాభం ఎంత వచ్చింది : బుగ్గన

గత ప్రభుత్వ హయాంలో రూ.38వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో సమావేశాల్లో చంద్రబాబు, మంత్రులు, అధికారుల విదేశీ పర్యటనపై ప్రశ్నోత్తరాల సమయంలో జరుగుతున్న చర్చలో ఆయన మాట్లాడారు. విదేశీ పర్యటనలతో  లాభం ఎంత వచ్చిందని ప్రశ్నించారు. చంద్రబాబు తిరిగినట్లు ఇతర రాష్ట్రాల సీఎంలు తిరగలేదన్నారు. అలాంటి రాష్ట్రాలకు కూడా పెట్టుబడులు వచ్చాయన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు సీఎంలు విదేశీ పర్యటనలకు వెళ్లారని మనం విన్నామా? అని ప్రశ్నించారు. ఐటీ కోసం తిరిగినట్లు తమిళనాడు ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదే అని అన్నారు. కంప్యూటర్‌ కూడా వాళ్లే కనిపెట్టినట్లు టీడీపీ ప్రభుత్వం చెబుతోందని, చంద్రబాబు వెళ్లడం కారణంగానే పరిశ్రమలు వచ్చాయని గొప్పగా చెబుతున్నారని విమర్శించారు. పరిశ్రమ పెట్టాలని గతంలో వైఎస్‌ కోరారని కియా మోటార్స్‌ ప్రతినిధులే చెబుతున్నారన్నారు. ఆరోజు వైఎస్‌ఆర్‌ చేసిన విజ్ఞప్తి మేరకే కియా మోటార్స్‌ పెట్టామని చెప్పారన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.