కామారెడ్డిలో గెలిచేది కాంగ్రెస్సే : షబ్బీర్​అలీ

కామారెడ్డిలో గెలిచేది కాంగ్రెస్సే : షబ్బీర్​అలీ

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డిలో గెలిచేది కాంగ్రెస్​ పార్టీయేనని, రాష్ట్రంలోనూ అధికారంలోకి వస్తామని ఆ పార్టీ సీనియర్​ నేత, మాజీ మంత్రి షబ్బీర్​అలీ పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని  బీబీపేట, మాచారెడ్డి మండలాలకు చెందిన పలువురు పార్టీలో చేరారు.  షబ్బీర్​అలీ మాట్లాడుతూ.. ప్రజల్లో మార్పు వచ్చిందని, కేసీఆర్​ మాయమాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

బీఆర్ఎస్​ మేనిఫెస్టోలో రూ.400కే సిలిండర్​ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇన్ని రోజులు అధికారంలో ఉండి ఏం చేసిందన్నారు.  వేరే రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్​పై పన్నులు తగ్గిస్తున్నా, ఇక్కడ ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ స్కీమ్​లను  అమలు చేస్తామని, బడుగు బలహీనవర్గాలకు అండగా ఉంటామన్నారు.