భద్రాచలం, వెలుగు: భద్రాద్రి జిల్లా చర్లలో మావోయిస్టు ఆర్పీసీ(రివల్యూషనరీ పీపుల్స్ కమిటీ) డిప్యూటీ కమాండర్ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. చర్ల మండలంలోని పూసుగుప్ప–లెనిన్ కాలనీ రోడ్డులో సీఆర్పీఎఫ్ 141బెటాలియన్తో కలిసి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనబడిన మావోయిస్టు ఆర్పీసీ డిప్యూటీ కమాండర్ సోడె దేవాను అదుపులోకి తీసుకుని విచారించారు.
అతడు చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా తరెం పోలీస్స్టేషన్ పరిధిలోని కోమటిపల్లి గ్రామానికి చెందినవాడని తేలింది. కోమటిపల్లి మావోయిస్టు పార్టీ ఆర్పీసీ డిప్యూటీ కమాండర్గా పనిచేస్తున్నట్లు భద్రాచలం ఏఎస్పీ పంకజ్ పరితోష్ వెల్లడించారు. 2019లో మావోయిస్టు పార్టీలో చేరిన దేవా డిప్యూటీ కమాండర్ స్థాయికి చేరుకున్నాడని, చర్ల ఎల్వోఎస్తో కలిసి చర్ల మండలం పూసుగుప్ప ప్రాంతంలో 2022 ఆగస్టులో పోలీసులను టార్గెట్ చేస్తూ ల్యాండ్మైన్ ఏర్పాటు చేశాడని చెప్పారు.