ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా చంపిన మావోలు

ఇన్ఫార్మర్ నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా చంపిన మావోలు

భదాద్రి కొత్తగూడెం జిల్లా: మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో  ఒక వ్యక్తిని దారుణంగా చంపేశారు. మృతుడు వరంగల్ నగరంలోని  లేబర్ కాలనీకి చెందిన ఈశ్వర్ అలియాస్ శ్రీను అని తేలింది. చత్తీస్ ఘడ్- తెలంగాణ సరిహద్దుల్లో నాయకులపు ఈశ్వర్ అనే హోంగార్డును మావోలు చిత్రహింసలు పెట్టి కొట్టి చంపారు. ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ అలియాస్ శ్రీను హోమ్ గార్డ్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతన్ని బంధించి సమాచారం కోసం తీవ్రంగా హింసించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. హోంగార్డు ఈశ్వర్ అలియాస్ శ్రీను మృతదేహాన్ని చర్ల మండలం చెన్నపురం దగ్గరలోని గొత్తికోయ గ్రామం గోరుగొండ దగ్గర వదిలేసి వెళ్లారు.