చెరువు కబ్జాపై బీఆర్ఎస్ లీడర్లకు వార్నింగ్ ఇచ్చిన మావోలు

చెరువు కబ్జాపై బీఆర్ఎస్ లీడర్లకు వార్నింగ్ ఇచ్చిన మావోలు


వరంగల్: జిల్లాలో మావోయిస్టుల లేఖ కలకలం రేపింది.  ప్రేమికుంట చెరువు కబ్జాపై బీఆర్ఎస్ లీడర్లకు వార్నింగ్​ఇచ్చారు.  రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారిపోయారని విమర్శించారు. హసన్ పర్తి, ధర్మసాగర్ మండలాల్లో భూ ఆక్రమణలు పెరిగిపోయాయని ఫైర్​అయ్యారు. చెరువు కోసం స్థానికులు, గ్రామస్తులు ఎంత పోరాటం చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నిర్లక్ష్యం చేసిన ఆఫీసర్లు, మోసాలకు పాల్పడుతున్న లీడర్లకు శిక్ష తప్పదని స్ట్రాంగ్​వార్నింగ్​ఇచ్చారు.  జీఎండబ్ల్యూపీ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్ పేరిట లేఖలు వెలిశాయి.