మార్గదర్శి క్వాష్‌ పిటిషన్‌పై విచారణ 8 వారాలకు వాయిదా

మార్గదర్శి క్వాష్‌ పిటిషన్‌పై విచారణ 8 వారాలకు వాయిదా

మార్గదర్శి క్వాష్ పిటిషన్ పై విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 8 వారాలకు వాయిదా వేసింది. యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ ఎఫ్ఎస్ఐఆర్ ను క్వాష్ చేయాలని హైకోర్టులో మార్గదర్శి పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై బుధవారం 2023 అక్టోబర్ 18న విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం... యూరిరెడ్డి ఫిర్యాదుపై సీఐడీ దర్యాప్తును 8 వారాలు నిలిపివేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.

కౌంటరు దాఖలు చేయాలని ప్రతివాదులు యూరిరెడ్డి, సీఐడీకి హైకోర్టు నోటీసులు పంపింది. తదుపరి విచారణను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

ALSO READ : బ్రో టూ మచ్: సుప్రీంకోర్టు ఎదుటే నిశ్చితార్థం చేసుకున్న మగాళ్లు