
మెహిదీపట్నం, వెలుగు : వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి ఖాయమని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. లంగర్ హౌస్ గొల్లబస్తీ లోని హనుమాన్ ఆలయం అడ్రస్పై మైనార్టీలకు చెందిన 32 ఓట్లు ఉన్నాయని తెలిపారు. గురువారం మధ్యాహ్నం పరిశీలించేందుకు వచ్చి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక ఆయన మాట్లాడారు. వన్ నేషన్– వన్ ఎలక్షన్తో కేసీఆర్కు ఇప్పటికే చెమటలు పడుతున్నాయన్నారు.
కార్వాన్ తో పాటు సిటీలో లక్షల్లో నకిలీ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. లంగర్ హౌస్ శ్రీ హనుమాన్ ఆలయంపై 9-–2–-140 బై చిరునామాతో 32 నకిలీ ఓట్లు మైనార్టీలకు చెందినవి ఉన్నాయని, దీనిపై ఈఆర్వో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంపై ఈసీకి, కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. నకిలీ ఓట్లపై సమగ్ర స్థాయిలో దర్యాప్తు చేయడం లేదని మండిపడ్డారు. పార్టీ సీనియర్ నేత దేవర శ్రీనివాస్, హైదరాబాద్ పార్లమెంట్ కన్వీనర్ ఇంద్రసేనారెడ్డి, కార్వాన్ ఇన్ చార్జ్ అమర్ సింగ్, డివిజన్ ప్రెసిడెంట్ నాగేంద్ర, ప్రకాష్ రెడ్డి, మురళీకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.