న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా మంగళవారం తన మనేసర్ ప్లాంట్లో ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏడాదికి లక్ష యూనిట్ల చొప్పున విస్తరించింది. హర్యానాలోని మనేసర్లో పనిచేస్తున్న మూడు తయారీ ప్లాంట్లలో ఏ ప్లాంట్కు అసెంబ్లింగ్ లైన్ను చేర్చింది.
కొత్త వెహికల్ అసెంబ్లింగ్ లైన్కు సంవత్సరానికి లక్ష యూనిట్లను తయారు చేయగల సామర్థ్యం ఉంటుంది. అదనపు అసెంబ్లీ లైన్తో, మనేసర్లో మొత్తం తయారీ సామర్థ్యం ఏడాదికి 9 లక్షల వాహనాలకు చేరుకుందని పేర్కొంది.