ఈ రోజుల్లో పెడిక్యూర్ గురించి తెలీని వాళ్లుండరేమో! వేడి నీటి తొట్టెలో పాదాలను ఉంచి క్రీములు పూసి, మసాజ్ చేస్తే కాళ్ల నొప్పులు తగ్గి కొంత రిలీఫ్ వస్తుంది. అయితే ఫిష్పెడిక్యూర్ చేయించుకుంటే ఇంకాస్త మెరుగైన ఫలితాలు వస్తాయంటున్నారు ఎక్స్ఫర్ట్స్. ఇందుకోసం గర్రా రూఫా ఫిష్లను వాడతారు. వీటినే ‘డాక్టర్ ఫిష్’ అని కూడా అంటారు. ఇవి పాదాలపై ఉండే డెడ్ స్కిన్ను తినేస్తాయి. దాంతో కొత్త చర్మం వచ్చి పాదాలు మెరుస్తాయి. ఈ ఫిష్ ట్యాంకులను బెంగళూరు కేఎస్ఆర్ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేశారు. ప్యాసింజెర్స్ తమ ట్రైన్ కోసం వెయిట్ చేసేటప్పుడు టైమ్ పాస్ కోసం ఫిష్ పెడిక్యూర్ చేయించుకోవచ్చు. దీంతో కొంతమంది ప్రయాణీకులు పెడిక్యూర్ చేయించుకుంటూ రిలీఫ్ పొందుతున్నారు.