
కరీంనగర్ : బ్యాంకు నుంచి రూ. 15 లక్షలు డ్రా చేసుకొని వెళ్తుండగా.. దొంగలు బ్యాగ్ను లాక్కుని పరారయ్యారు. ఈ ఘటన సోమవారం కరీంనగర్లో జరిగింది. స్థానిక సాయివాణి ఆర్ఎంసీ కంపెనీలో పనిచేస్తున్న రామగిరి చంద్ర ప్రకాశ్, బోడ మల్లారెడ్డి సోమవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని బ్యాంక్లో రూ. 15లక్షలు డ్రా చేశారు. మల్లారెడ్డి బైక్ నడుపుతుండగా చంద్రప్రకాశ్ క్యాష్ బ్యాగ్ పట్టుకుని వెనుక కూర్చున్నారు. పద్మనాయక కల్యాణ మండపం దగ్గరకు రాగానే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్పై వచ్చి వారిని అడ్డుకొన్నారు. డబ్బులున్న బ్యాగ్ను లాక్కొని క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.