లాక్డౌన్ టైంలో భారీగా పెరిగిన బర్త్​రేట్

లాక్డౌన్ టైంలో భారీగా పెరిగిన బర్త్​రేట్
కరోనా దెబ్బకు అన్ని దేశాల జీడీపీ పడిపోతోంది. ఉద్యోగాలు పోతున్నయ్. జీతాలు తగ్గుతున్నయ్​. ఈ టైంలో పెరిగింది ఏమన్నా ఉందాని లెక్కగడితే ఇగో సంతానం పెరుగుతోందని ఫిలిప్పీన్స్​ అధికారులు అంటున్నారు. ఆసియా దేశాల్లో అత్యధిక జననాల రేటు ఉన్న దేశం ఇది. ఈ సమస్య నుంచి బయటపడాలని ఆ దేశం 1960 నుంచి పాపులేషన్​ కంట్రోల్​ కోసం ప్లాన్స్​ అమలు చేస్తూనే ఉంది. అవి కొంచెం సక్సెస్​ కావడంతో బర్త్​ రేట్​ సగానికి పడిపోయింది. అది పక్క దేశాలతో పోల్చితే ఎక్కువే అనుకోండి! అధికారులు ఆ తగ్గుదల చూసి సంబురపడుతున్నారు. అయితే మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు క్యాథలిక్​ చర్చ్​ ఫ్యామిలీ ప్లానింగ్​ని వ్యతిరేకించింది. కానీ, అది పేరెంట్స్​ ఇష్టమని ఛాయిస్​ ఇచ్చింది. ఇట్ల ఆ దేశంలో సంతానం చుట్టూ రాజకీయాలు, విశ్వాసాలు ఉన్నాయి. ఇప్పుడు కరోనా వైరస్​ ఈ లెక్కల్ని మార్చేసింది. దీని దెబ్బకు ఒక్కసారిగా బర్త్​రేట్​ పెరిగింది. ఆ దేశంలో ఏటా 17 లక్షల మంది పిల్లలు పుడుతున్నారు. దీనికి అదనంగా  వచ్చే ఏడాదికి 2,14,000 మంది పిల్లలు పుడతారని ఆ దేశ ఆరోగ్య శాఖ లెక్కగట్టింది. 1969లో 6.4 శాతంగా ఉన్న బర్త్​ రేట్​ 2020 నాటికి 2.75కి చేరింది. ఇక వచ్చే సంవత్సరంలో జననాలు 20 శాతం పెరుగుతాయని లెక్కలు చెబుతున్నాయి. అసలే పేదరికం, కరోనా ప్రభావంతో సతమతవుతున్న ఆ దేశం ఈ సంతాన విప్లవంతో మరికొన్ని కష్టాల్లోకి పోతుంది. డెలివరీ కోసం వచ్చే వాళ్లకి బెడ్స్​ సరిపోక రెండు బెడ్స్​ని కలిపి నలుగురికి ఇస్తున్నారు. ముందు ముందు అంతకంటే ఎక్కువ మందికి ఇవ్వాల్సి వస్తుందని డాక్టర్స్​ అంటున్నారు.