మయాంక్ శతకం..నిలకడగా టీమిండియా బ్యాటింగ్

మయాంక్ శతకం..నిలకడగా టీమిండియా బ్యాటింగ్

ముంబైలో న్యూజిలాండ్ తో జరుగుతోన్న రెండో టెస్టు మొదటి రోజు మయాంక్ అగర్వాల్ చెలరేగిపోయాడు. ఫస్ట్ టెస్టులో విఫలమైన మయాంక్ రెండో టెస్టులో  సెంచరీ చేశాడు. తన టెస్టు కెరీర్ లో నాల్గో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ 67 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్లు కోల్పోయి 210 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్ అగర్వాల్ 110, వృద్ధిమాన్ సాహా 24 పరుగులతో ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో అజాజ్ పటేల్ ఒక్కడే నాలుగు వికెట్లు తీశాడు.