
హైదరాబాద్ సిటీ/అల్వాల్/సికింద్రాబాద్/జీడిమెట్ల, వెలుగు: గణేశ్విగ్రహాల నిమజ్జనానికి చెరువులతోపాటు బేబీ పాండ్స్ను సిద్ధం చేయాలని జీహెచ్ఎంసీ మేయర్గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు. గ్రేటర్పరిధిలోని చెరువుల వద్ద చేస్తున్న నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించేందుకు శుక్రవారం ఆమె విస్తృతంగా పర్యటించారు. కూకట్ పల్లి జోన్ హస్మత్ పేట లేక్, బేబీ పాండ్, ప్రగతినగర్ చెరువు, ఐడీఎల్ లేక్, లింగం చెరువు, కొత్త చెరువు, వెన్నెల గడ్డ చెరువులను, బేబీ పాండ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువుల నుంచి తొలగించిన గుర్రపుడెక్క, ఫ్లోటింగ్ మెటీరియల్ను వదిలేసిన రాంకీ ఏజెన్సీపై, అధికారులపై మేయర్ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేపీహెచ్బీలో ఓపెన్ జిమ్, అమ్మ భగవాన్ టెంపుల్ వద్ద బాక్స్ డ్రెయిన్నిర్మాణ పనులను మేయర్పరిశీలించారు. మంగాపురం కాలనీ ఫుట్ బాల్ గ్రౌండ్పనులను స్పీడప్చేయాలని సూచించారు. మేయర్ వెంట జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్, కార్పొరేటర్లు ఉన్నారు. అలాగే ఓల్డ్బోయిన్పల్లి హస్మత్పేటలోని బోయిన్ చెరువు మేయర్పరిశీలించారు. మేయర్పరిశీలనకు వచ్చే టైంకు సంబంధిత అధికారులు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్పాటించరా అని అధికారులను ప్రశ్నించారు. అలాగే కుత్బుల్లాపూర్నియోజకవర్గంలోని వెన్నెలగడ్డ చెరువు, లింగం చెరువు, పరికి చెరువుల వద్ద చేస్తున్న ఏర్పాట్లను మేయర్తనిఖీ చేశారు.