వికారాబాద్, వెలుగు: కాలేజీ ఆవరణలో టెన్నిస్ఆడుతుండగా గుండెపోటుతో ఓ ఎంబీబీఎస్స్టూడెంట్మృతి చెందింది. హైదరాబాద్కు చెందిన మేఘన(19) వికారాబాద్జిల్లా కేంద్రంలోని మహావీర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ఫస్ట్ఇయర్చదువుతోంది. కాలేజీ హాస్టల్లోనే ఉంటోంది. సోమవారం రాత్రి కాలేజీ అయిపోయాక ఫ్రెండ్స్తో కలిసి టెన్నిస్ఆడుతుండగా మేఘన ఒక్కసారిగా కుప్పకూలింది. తోటి విద్యార్థులు, స్నేహితులు ఆమెను చికిత్స కోసం స్థానిక మహావీర్ ఆసుపత్రికి తరలించారు. కండిషన్సీరియస్గా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా దారిలోనే మేఘన చనిపోయింది. యువతి మృతికి గుండెపోటే కారణమని డాక్టర్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
