
మెదక్ జిల్లా: నర్సాపూర్ లో తల్లి, కుమారుడు కిడ్నాప్ అయ్యారనే వార్త కలకలం రేపుతోంది . పట్టణానికి చెందిన మసత్(30) అనే మహిళ తన కొడుకుతో కలసి ఆస్పత్రికి వెళ్తున్న అని చెప్పి ఇంటి నుంచి బయటికి వెళ్లింది. కాసేపటి తర్వాత తనను ఏవరో కిడ్నాప్ చేస్తున్నారని భర్తకు ఫోన్ ద్వారా తెలిపింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో ఆమె భర్త పోలీసులకు పిర్యాదు చేశాడు. అయితే మహిళను నిజంగానే కిడ్నాప్ చేసారా లేదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారి బంధువులు. గత కొద్దిరోజులుగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఆ కారణాల వల్ల ఆమె బయటకు వెళ్లి ఉంటుందని బంధువులు చెబుతున్నారు. ఆమె భర్త ద్వారా ఫిర్యాదు అందుకున్న పోలీసులు దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.