కాగజ్ నగర్, వెలుగు: తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు గగ్గోలు పెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్కుమార్.. ఇప్పుడు కండువా మారగానే ఫోన్ ట్యాపింగ్ అసలు తప్పే కాదంటూ మాట మార్చడం విడ్డూరంగా ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సోమవారం కాగ జ్ నగర్ లో ఆయన మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఎస్పీఎం కార్మికులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్పై పదేపదే విమర్శలు చేసిన ప్రవీణ్కుమార్.. సిర్పూర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన తరువాత బీఆర్ఎస్లో చేరారన్నారు. కండువా మారగానే ఫోన్ ట్యాపింగ్ ఒప్పు అయిందా అని ప్రశ్నించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో బహిరంగ చర్చకు బీఆర్ఎస్ సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే హరీశ్ బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, జిల్లా ఎన్నికల ప్రబారీ భూమయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్, శివ పాల్గొన్నారు.
