నాంపల్లి కోర్టుకు వైఎస్ షర్మిల..కాసేపట్లో రిమాండ్?

నాంపల్లి కోర్టుకు వైఎస్ షర్మిల..కాసేపట్లో రిమాండ్?

SR నగర్ పోలీస్ స్టేషన్ లోనే షర్మిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అమీర్ పేట్ ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. ఆమెను నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 41-A సీఆర్పీసీ కింద నోటీసులు అందించి రిమాండ్ చేసే అవకాశం ఉంది. మరోవైపు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న షాపుల్ని క్లోజ్ చేయించారు పోలీసులు. 

మరోవైపు లోటస్​ పాండ్​ లో వైఎస్​ విజయమ్మ నిరాహార దీక్ష కొనసాగుతోంది. తన బిడ్డను చూసే హక్కు కూడా లేదా అని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. కూతురిని చూడటానికి వెళ్తే పోలీసులకు వచ్చిన ఇబ్బందేంటని నిలదీశారు. షర్మిలను పరామర్శించేందుకు బయల్దేరిన విజయమ్మను లొటస్ పాండ్ దగ్గర పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే దాడులు చేస్తారా అని తెలిపారు.  షర్మిల ఇంటికొచ్చే వరకు దీక్ష చేస్తానని చెప్పారు.  అసలు  షర్మిల చేసిన  నేరమేంటని నిలదీశారు. పాదయాత్ర చేస్తే తప్పా? పాదయాత్ర చేయడం రాజ్యాంగ విరుద్ధమా? అని ప్రశ్నించారు. తాము  ప్రభుత్వాలు నడిపామని..? తమకు పోలీసులు కొత్తేమీకాదన్నారు.  నిరసన తెలిపితే షర్మిలను అరెస్ట్ చేస్తారా అని నిలదీశారు. పాదయాత్ర ముగిసే టైంలో ఇలా దాడులు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదని.. ప్రజల నుంచి షర్మిలను ఎవ్వరూ వేరు చెయ్యలేరన్నారు.