నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా

నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా

అందరూ కలిసి స్వామీజీ నిత్యానందని తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది నటి మీరా మిథున్.  నిత్యానంద  రోజురోజుకు మరింత శక్తిమంతంగా మారుతున్నారంటూ ట్విట్లర్ లో ట్వీట్ చేసింది. తాను త్వరలోనే నిత్యానంద కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. అంతేకాదు ‘లాట్స్ ఆఫ్ లవ్’ అని ట్వీట్ చేసింది. భారత్ నుంచి పరారైన నిత్యానంద ఓ దీవిని కొనుగోలు చేసి, దానిని ‘రిపబ్లిక్ ఆఫ్ కైలాస’ పేరుతో ప్రత్యేక దేశంగా ప్రకటించినట్టు ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాసను కూడా ఏర్పాటు చేసి కరెన్సీని కూడా ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.