
గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ట్రెండ్ ను ఫాలో అవడం లేదు ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. ఇటీవల ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎయిర్ ఫోర్స్ వంటి కొత్త పాయింట్ ను పరిచయం చేసిన వరుణ్ ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడట. అందుకోసం AI టెక్నాలజీని వాడుతున్నాడట.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం డైరెక్టర్ కరుణకుమార్ తో మట్కా సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో వరుణ్ డాన్ గా కనిపించనుండగా.. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా తరువాత వరుణ్ తేజ్ చేయబోతున్న ప్రాజెక్టు ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. ప్రస్తుతం జనరేషన్ లో ఎక్కడ చూసినా AI(ఆర్టిఫీషియల్ ఇంటలీజెన్స్) టెక్నాలజీ గురించి చర్చ నడుస్తోంది. ఇప్పుడు వరుణ్ తేజ్ ఇదే పాయింట్ ని తన తరువాతి సినిమా కోసం వాడుతున్నాడట.
అది కూడా ప్యూర్ లవ్ స్టోరీగా రానుందని సమాచారం. వినడానికే కాస్త కొత్తగా ఉన్న ఈ పాయింట్ తో వరుణ్ సినిమా చేస్తుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యింది. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న తెరకెక్కనున్న ఈ సినిమాను దర్శకుడు విక్రమ్ సిరికొండ తెరకెక్కించనున్నాడని టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రానుంది. మరి సరికొత్త పాయింట్ తో వస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.