- మంత్రి తలసాని శ్రీనివాస్
అబిడ్స్, వెలుగు: జాబ్ మేళాను స్టూడెంట్లు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. అబిడ్స్ లోని మెథడిస్ట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆటా(అమెరికా తెలుగు అసోసియేషన్) ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్ను మంత్రి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళా.. స్టూడెంట్లకు గొప్ప అవకాశం లాంటిదన్నారు. జాబ్ ఫెయిర్లో ఆరు కంపెనీలు పాల్గొన్నాయని.. మంగళవారం సైతం కొనసాగుతుందని ఆటా అధ్యక్షురాలు మధు బోమినేని తెలిపారు.