
గెటప్ శ్రీను హీరోగా కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాజు యాదవ్’. అంకిత ఖరత్ హీరోయిన్. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి నిర్మించిన ఈ చిత్రం మే 24న ప్రేక్షకుల ముందుకురాబోతోంది. తాజాగా ఈ మూవీ టీమ్కు చిరంజీవి తన విషెస్ను అందజేశారు. ఆదివారం చిరంజీవిని కలిసిన గెటప్ శ్రీను ఆయన బ్లెస్సింగ్ను తీసుకున్నాడు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘గెటప్ శ్రీను పేరు తలచుకోగానే జబర్దస్త్ లో రకరకాల గెటప్పులు
హావభావాలు, గొంతులు, యాస మార్చి నటిస్తూ నవ్వించే నటుడు మన కళ్ళముందు కనబడతాడు. ఈ తరం కామెడీ నటుల్లో నాకు ఇష్టమైన నటుడు గెటప్ శ్రీను. తను హీరోగా వస్తున్న రాజు యాదవ్ ట్రైలర్ చూశా. చాలా బావుంది. కొత్తదనం కనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది, కవ్విస్తుంది, వినోదం పంచుతుంది. ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల మెప్పు పొందుతుందని ఆశిస్తున్నా’ అని అన్నారు.