మై డియర్ ప్రభాస్ బాక్సాఫీస్ను తగలబెట్టేశావ్.. సలార్ మూవీపై మెగా రివ్యూ

మై డియర్ ప్రభాస్ బాక్సాఫీస్ను తగలబెట్టేశావ్.. సలార్ మూవీపై మెగా రివ్యూ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన తాజా చిత్రం సలార్(Salaar). కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth neel) తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వచ్చింది. ప్రేక్షకుల నుండి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది సలార్ మూవీ. దీంతో బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది ఈ మూవీ. తొలిరోజు ఏకంగా రూ.170 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ మూవీ. నార్మల్ ఆడియన్స్ తో పాటు,సినీ సెలబ్రెటీలు కూడా సలార్ సినిమాను థియేటర్స్ లో చూసి ఖుషీ అవుతున్నారు. 

ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా సలార్ సినిమా చూసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. సలార్ మూవీపై తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.. మై డియర్ దేవా బాక్సాఫీస్ ను తగలబెట్టేశావు. రెబల్ స్టార్ ప్రభాస్ కి శుభాకాంక్షలు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సరికొత్త ప్రపంచాన్ని సృష్టించడం లో మీకు మీరే సాటి మీకు నా అభినందనలు. వరదరాజ మన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్, ఆద్య శృతి హాసన్, కార్త పాత్రలో జగపతి బాబు అద్భుతంగా నటించారు. హోంబాలే సంస్థకు, చిత్ర యూనిట్ మొత్తానికి నా కంగ్రాట్స్.. అంటూ రాసుకొచ్చారు చిరంజీవి. తమ అభిమాన హీరో సినిమాపై చిరంజీవి స్పందించడంపై ప్రభాస్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. థాంక్ యూ అండ్ లవ్ యూ బాస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.