ప్రముఖ డైరెక్టర్ కె.విశ్వనాథ్ ఇవాళ హైదరాబాద్ లో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి టాలీవుడ్ ప్రముఖలు నివాళులర్పిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు విశ్వనాథ్ నివాళులర్పించారు. విశ్వనాథ్ కుటుంబసభ్యులను వారు పరామర్శించారు.
విశ్వనాథ్ దర్శకత్వంలో తాను ఎంతో నేర్చుకున్ననని చిరంజీవి చెప్పారు. ఆయన సినిమాలు యువ దర్శకులకు గ్రంథాలయలాంటివి అన్నారు. విశ్వనాథ్ తన పితృసమానం అని.. ఆయనతో పరిచయం ఏర్పడటం తనకు దేవుడు ఇచ్చిన వరమన్నారు. వారణాసిలో ఇంద్ర సినిమా షూటింగ్ అయ్యే టైంలో తన పక్కనే ఉన్నాడని మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. ఈ రోజు శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది. అదే రోజు ఆయన మనకి దూరం అయ్యాడని చిరు ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వనాథ్ గురువారం రాత్రి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో టాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి. పలువురు సినీ నటులు, రాజకీయ నాయకలు కళాతపస్వి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సినీ వర్గాల సమాచరం ప్రకారం ఇవాళ ఉదయం11:30 గంటలకు పంజాగుట్ట స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు.