మేళ్లచెరువు,వెలుగు: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ నాయక్ ను అక్రమ ఫౌతి ఘటనలో కలెక్టర్ తేజస్ నందూలాల్ పవార్ సస్పెండ్ చేశారు. రాఘవపురం గ్రామానికి చెందిన సాతులూరి ఉమా భర్త మరణించగా.. కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ఇతర కుటుంబ సభ్యులకు ఫౌతి చేశాడు. ఈ విషయంపై ఉమా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన కలెక్టర్ తేజస్ నందూలాల్ పవర్ డిప్యూటీ తహసీల్దార్ను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
