IND vs ENG: గాంధీ తాత స్థానంలో అశ్విన్.. రూ. 500 కరెన్సీ నోటు విడుదల చేసిన మీమర్స్!

IND vs ENG: గాంధీ తాత స్థానంలో అశ్విన్.. రూ. 500 కరెన్సీ నోటు విడుదల చేసిన మీమర్స్!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 500 టెస్టు వికెట్ల క్లబ్‍లో చేరిన విషయం తెలిసిందే. 15 పరుగుల వద్ద జాక్ క్రాలీని అవుట్ చేయడంతో అశ్విన్.. ఈ మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా టెస్టు క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన తొమ్మిదో బౌలర్‌గా, రెండో భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సంధర్బంగా అరుదైన మైలురాయిని చేరుకున్న అశ్విన్‌కు నెటిజెన్స్.. అరుదైన గౌరవం కల్పిస్తున్నారు. అతని పేరిట రూ. 500 కరెన్సీ నోటు విడుదల చేశారు. 

ALSO READ : ఫుల్లుగా తాగి మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన.. HCA కోచ్‌పై సస్పెన్షన్‌ వేటు

భారత కరెన్సీ నోట్లపై మహాత్మ గాంధీ ఫోటో ఉన్న విషయం అందరికీ విదితమే. ఈ క్రమంలో మీమర్స్.. 500 టెస్టు వికెట్లకు గుర్తుగా రూ. 500 కరెన్సీ నోటుపై గాంధీ ఫోటో స్థానంలో అశ్విన్ ఫొటో చొప్పించారు. దాన్ని కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. కొందరు యూజర్లు దీనికి రాజకీయ రంగు పులుముతున్నారు. అశ్విన్ బీజేపీలో చేరతానని హామీ ఇస్తే అది సాధ్యమేనంటూ వ్యగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి మరికొన్ని మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

రసవత్తరంగా రాజ్‌కోట్‌ టెస్ట్

తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 445 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఇంగ్లాండ్ బ్యాటర్లు అదే రీతిలో బదులిస్తున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ 238 పరుగులు వెనకబడి ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. వారి దూకుడు చూస్తుంటే మ్యాచ్ లో పైచేయి సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.