వర్షంతో మెట్రో పంట పండింది

వర్షంతో మెట్రో పంట పండింది

హైదరాబాద్‌ :వర్షం కోసం కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న సమయంలో శుక్రవారం కుండపోతగా కురిసిన వానకు పల్లెల్లోని అన్నదాతలకే కాదు..సిటీలోని మెట్రోకు కూడా పంట పండింది. హైదరాబాద్ లో శుక్రవారం ఒక్కరోజే మెట్రో రైళ్లలో 2.89 లక్షల మంది ప్రయాణించారు. రాత్రి వర్షం కురవడంతో ఎక్కువ మంది మెట్రోలో ప్రయాణించినట్లు తెలిపారు మెట్రో అధికారులు.

గత శుక్రవారం కన్నా నిన్న 15 వేల మంది ఎక్కువగా మెట్రో రైళ్లలో ప్రయాణించారు. మొత్తం 3 లక్షల 6వేల మంది ప్రయాణికులు మెట్రో స్టేషన్లకు వచ్చినట్లు మెట్రో ఉన్నతాధికారులు తెలిపారు.  గతంతో పోల్చితే రోజురోజుకూ మెట్రో స్మార్ట్ కార్డు తీసుకున్న ప్రయాణికులు కూడా పెరుగుతున్నారని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వివరించారు.