చేప పిల్లల కాంట్రాక్టులూ ఆంధ్రోళ్లకే

చేప పిల్లల కాంట్రాక్టులూ ఆంధ్రోళ్లకే

హైదరాబాద్, వెలుగు: దశాబ్ది ఉత్సవాల పేరుతో అధికార బీఆర్ఎస్​ కొత్త డ్రామాకు తెరదీసిందని ఫిషర్​మెన్​ కాంగ్రెస్​ చైర్మన్​ మెట్టు సాయి కుమార్​ ఆరోపించారు. మత్స్యకారులను కేసీఆర్​ సర్కార్​ నిండా ముంచిందన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకే  చేప పిల్లల కాంట్రాక్ట్​లను బీఆర్ఎస్​ ప్రభుత్వం ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చేప పిల్లల పంపిణీలోనూ 30 శాతం కమీషన్​ తీసుకున్నారని ఆరోపించారు. కమీషన్​ లేకుండా మత్స్యకార సొసైటీల్లో కనీసం సభ్యత్వం కూడా ఇవ్వడం లేదన్నారు. సొసైటీల అధికారాలను తగ్గించి నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నాసిరకం చేప పిల్లల వల్ల మత్స్యకారులు నష్టపోతున్నారన్నారు.  ఈ నెల 8న ప్రభుత్వం నిర్వహించే చెరువుల పండుగను మత్స్యకారులు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.