IPL 14: బెంగళూరు టార్గెట్ 160

IPL 14: బెంగళూరు టార్గెట్ 160

ఎట్టకేలకు ఐపీఎల్ 14 సీజన్ స్టార్ట్ అయ్యింది. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు 160 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.  ముంబై ఓపెనర్లలో రోహిత్ శర్మ 19 పరుగులకే ఔటవ్వగా.. మరో ఓపెనర్ క్రిస్ లిన్ 49 పరుగులతో చెలరేగాడు. సూర్యకుమార్ యాదవ్ 31, ఇషాన్ కిషాన్ 28  పరుగులతో రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో బెంగళూరుకు 160 పరుగుల టార్గెట్ ను ముందుంచింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 5 వికెట్లతో చెలరేగగా.. జేమిసన్ ,వాషింగ్టన్ సుందర్ కు చెరో వికెట్ పడ్డాయి.