వలస కార్మికున్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు

వలస కార్మికున్ని కాల్చి చంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి ఒడికట్టారు. మరో వలస కార్మికుడిని ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు.  బందిపొరా జిల్లాలో బీహార్ కు చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.  అయితే బిహార్  వలస కార్మికుడు మహమ్మద్ అమ్రేజ్ ను బందిపొరా వద్ద హతమార్చినట్లు వివరించారు. అమ్రెజ్ ను ఆస్పత్రికి తరలించగా..... చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.  అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులు మహ్మద్ అమ్రేజ్ పై కాల్పులు జరిపారని.. అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. అక్కడే మరణించినట్లు కాశ్మీర్ పోలీసులు స్పష్టం చేశారు.

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో సైనిక శిబిరంపై జరిగిన దాడి జరిగిన ఒక్క రోజు తర్వాతే వలస కార్మికున్ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అయితే ఇటీవల జరిగిన ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించగా.. ఒకరు గాయపడ్డారు.