- భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
భద్రాచలం, వెలుగు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 40 ఏండ్లుగా ప్రజలకు సేవ చేస్తూ మన్ననలు అందుకున్నారని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు.
తుమ్మల 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై శనివారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో అభినందన సభ నిర్వహించి, ఆయన ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. పెరిక కార్పొరేషన్ వైస్ చైర్మన్ బుడగం శ్రీనివాసరావు, సర్పంచ్ పూనెం కృష్ణదొర, తుమ్మల అభిమానులు ఎస్ఏ రసూల్, యశోద రాంబాబు పాల్గొన్నారు.
