రాజస్థాన్ కన్హయ్య ఘటనపై స్పందించిన ఓవైసీ

రాజస్థాన్ కన్హయ్య  ఘటనపై స్పందించిన ఓవైసీ

రాజస్థాన్ లో కన్హయ్య హత్యపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. కన్హయ్య హత్య చాలా బాధాకరమని పేర్కొన్నారు. రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలను అరికట్టకపోతే తీవ్రవాదం పెరిగిపోతుందన్నారు. ఘటనకు బాధ్యుడిగా పరిగణిస్తూ నుపూర్ శర్మను సస్పెండ్ చేస్తే సరిపోదని...వెంటనే అరెస్ట్ చేయాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు.