TRS మద్దతుతోనే MIM పార్టీ అవినీతికి పాల్పడుతోంది

TRS మద్దతుతోనే MIM పార్టీ అవినీతికి పాల్పడుతోంది

MIM తో కలిసి మేయర్ సిటీ గెలవడం TRS దివాళా కోరుతనానికి నిదర్శనమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. GHMC ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ కు ఓటు వేసిన మజ్లీస్ కి ఓటు వేసినా ఒకటే అని చెప్పామన్నారు. ఎన్నికల్లో కూడా ఇద్దరు కలిసి పోటీచేశారన్నారు. మజ్లీస్ పోటీ చేసిన ప్రాంతంలో టీఆర్ఎస్ కనీసం పోటీ చేయలేదని చెప్పారు. OYC కుటుంబ, కేసీఆర్ కుటుంబ ఒకటే… ఇద్దరు కలిసి ఒకటే ప్లేట్ లో బిర్యానీ తింటారని అన్నారు. టీఆర్ఎస్ పరిపాలనలో హైదరాబాద్ ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. హైదరాబాద్ పాతబస్తీ అబివృద్ధిలో వెనకబడిందని… దానికి కారణం మజ్లీస్ పార్టీయేనన్నారు.

GHMC అవినీతిలో కురుకపోయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మజ్లీస్ పార్టీకి అబివృద్ధి అవసరం లేదన్నారు. టీఆర్ఎస్ మద్దతుతోనే మజ్లీస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందన్నారు. పాతబస్తీలో పోలీసులు, అధికారులు, రెవెన్యూశాఖ అధికారులను ఎవరిని తీసుకోవాలనేది దారు సలామ్ లో నిర్ణయం తీసుకుంటారన్నారు. మజ్లీస్ పార్టీతో పొత్తు లేకుంటే టీఆర్ ఎస్ సింగిల్ డిజిట్ కి పడిపోయేదని తెలిపారు. హిందువులను, హిందూ దేవుళ్లను తిట్టే పార్టీ… హిందువులను ఉంచకోత కోస్తా అన్న పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నావో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.రాజాకార్ల భావాలు కలిగిన పార్టీ మజ్లీస్ నాయకులకు TRS నాయకులు ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయంలో MIM పాత్ర ఉంటుందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణనను వ్యతిరేకించిన పార్టీ మజ్లీస్ పార్టీ…అలాంటి పార్టీతో టీఆర్ఎస్ ఎలా పొత్తు పెట్టుకుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో మహిళపై అగౌరవంగా మాట్లాడటం తప్పని…ప్రభుత్వాలు చేసే తప్పులపై ప్రతిపక్షాలు పోరాడుతాయన్నారు. బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం మంచిది కాదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి…..పోరాటాలు చేసే హక్కు అందరికి ఉందన్నారు.