ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ప్రమాణం

ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ప్రమాణం

రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేశారు MIM సీనియర్ MLA అక్బరుద్దీన్ ఒవైసీ. హైదరాబాద్ రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్ తో ప్రమాణం చేయించారు గవర్నర్ తమిళిసై. కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఇతర ముఖ్య నేతలు అటెండయ్యారు. అటు బీఆర్ఎస్ నుంచి సీనియర్ సభ్యులు పోచారం, హరీశ్ రావు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేసిన అక్బరుద్దీన్ ను గవర్నర్ తమిళిపై అభినందించారు. సీఎం రేవంత్, ఇతర ముఖ్య నేతలు అక్బర్ కు బొకే ఇచ్చి విషెస్ చెప్పారు.

ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన MLA లతో సభలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.  అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. 3 నుంచి 4  రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని తెలుస్తోంది.